Share News

Delhi: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. రోజువారీ వేతనం పెరిగిందోచ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:33 PM

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధి హామీ కూలీల వేతనాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకుగానూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (MGNREGS) 4 - 10 శాతం వరకు వేతనాలు పెంచింది. వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం పెంపుదలను ప్రతిపాదించింది.

Delhi: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. రోజువారీ వేతనం పెరిగిందోచ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

ఢిల్లీ: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధి హామీ కూలీల వేతనాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాలకుగానూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద (MGNREGS) 4 - 10 శాతం వరకు వేతనాలు పెంచింది. వేతనాల సవరణలో భాగంగా ప్రభుత్వం పెంపుదలను ప్రతిపాదించింది. ఈ పథకం కింద నైపుణ్యం లేని కార్మికులకు హర్యానాలో అత్యధిక వేతనం రోజుకు రూ.374 అందనుండగా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రూ.234 వేతనం అందనుంది.

సిక్కింలోని మూడు పంచాయితీలు గ్నాతంగ్, లాచుంగ్, లాచెన్ ప్రజలు రోజుకు సగటు వేతనం రూ. 374 వేతనం పొందనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ పథకం కింద వేతన సవరణను మార్చి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. నైపుణ్యం లేని కార్మికులు వారు నివసిస్తున్న గ్రామంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నోటిఫికేషన్ ప్రకారం.. గోవాలో వేతన పెంపు రేటు దేశంలోనే అత్యధికంగా రూ.34గా ఉంది.


ప్రస్తుతం అక్కడ రోజువారీ కూలీ రూ.356 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వేతన పెంపు రూ.28గా ఉంది. ఇప్పుడు మొత్తం కూలీ రూ.300కి చేరింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పెరుగుదల అత్యల్పంగా రూ.7గా ఉంది. రెండు రాష్ట్రాలలో పని చేసే కార్మికులు రోజుకు రూ.237 వేతనం అందుకోనున్నారు.

తెలంగాణలో రూ.28 పెంచడంతో రోజువారీ కూలీ రూ.300కి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో రూ.250 (రూ.13 పెరుగుదల), తమిళనాడులో రూ.319 (రూ.25 పెరుగుదల), బీహార్‌లో రూ.228 (రూ.17 పెరుగుదల)గా ఉంది. వేతన రేటు పరంగా హర్యానా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పెరుగుదల కేవలం నాలుగు శాతంగానే ఉంది. మొత్తంమీద పెంపుదల 4 నుంచి 10 శాతం మధ్య ఉంది. తెలంగాణ, ఏపీ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 10 శాతం పెరుగుదల నమోదైందని నోటిఫికేషన్ డేటా వెల్లడిస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 03:39 PM