PM Surya Ghar Muft Bijli Yojana: గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్..!
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:42 PM
PM Surya Ghar Muft Bijli Yojana: ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం.
![PM Surya Ghar Muft Bijli Yojana: గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్..!](https://media.andhrajyothy.com/media/2023/20231205/PM_Surya_Ghar_Muft_Bijli_Yojana_b96f314220.jpg)
PM Surya Ghar Muft Bijli Yojana: ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించే లక్ష్యంతో కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ట్వీట్ చేసిన పీఎం మోదీ.. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పథకానికి రూ. 75,000 కోట్లు ఖర్చు అవుతుందని, ప్రతి నెలా 300 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా 1 కోటి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపుతామని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్..
‘మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రారంభిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 75,000 కోట్లతో, ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.