MP: కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీలో చేరతానని చెబితే చెప్పుతో కొడతా..
ABN , Publish Date - Feb 29 , 2024 | 01:29 PM
కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి బీజేపీలో చేరుతున్నట్లు తనపట్ల దుష్ప్రచారం చేసేవారిని చెప్పుతో కొడతానంటూ ఆ పార్టీ ఎంపీ ఎస్ తిరునావుక్కరసు(MP S Thirunavukkarasu) మండిపడ్డారు.
![MP: కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీలో చేరతానని చెబితే చెప్పుతో కొడతా..](https://media.andhrajyothy.com/media/2024/20240227/nani7_2_d9b485abc1.jpg)
- కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కరసు
చెన్నై: కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి బీజేపీలో చేరుతున్నట్లు తనపట్ల దుష్ప్రచారం చేసేవారిని చెప్పుతో కొడతానంటూ ఆ పార్టీ ఎంపీ ఎస్ తిరునావుక్కరసు(MP S Thirunavukkarasu) మండిపడ్డారు. తిరుచ్చిలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయథరణి బాటలోనే మీరు కూడా బీజేపీలో చేరుతున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా... ఆ విషయం చెప్పే వ్యక్తి తన ఎదుటకు వస్తే చెప్పుతో కొడతాననని, ఇకపై శీమాన్లాగే మాట్లాడాలని నిర్ణయించుకున్నానని మండిపడ్డారు. అన్నాడీఎంకేని ఎన్డీయేలో చేర్చుకునేందుకే మోదీ తన ప్రసంగాలలో ఎంజీఆర్, జయపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని ఆయన విమర్శించారు.