Minister: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రికి నోటీసులు
ABN , Publish Date - Mar 29 , 2024 | 10:53 AM
లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మేరకు మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar)కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
బెంగళూరు: లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మేరకు మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar)కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న మంత్రి కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సభ జరిపారు. ముందస్తుగా అనుమతులు తీసుకోకుండానే వందలాది మంది ద్వారా సభ నిర్వహించడంతో పాటు పంపిణీలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. కోడ్ నిబంధనల ప్రకారం ముందుగా సభ జరిపేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన మేరకు దాఖలైన కేసును ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఏప్రిల్ 30వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీసులలో సూచించింది. సభ నిర్వహించిన భవన యజమాని ఉమేష్ మల్లప్ప వాసణ్ణకు నోటీసులు జారీ చేశారు.