Share News

Minister: తేల్చిచెప్పేసిన మంత్రి.. మా కుటుంబీకులెవరూ ఎన్నికల్లో పోటీ చేయరు..

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:29 PM

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి నాకు లేదని ప్రజాపనుల శాఖా మంత్రి సతీష్‌ జార్కిహోళి(Minister Satish Jarkiholi) స్పష్టం చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. బెళగావి లేదా చిక్కోడి లోక్‌సభ స్థానాల నుంచి తన కుటుంబానికి చెందిన ఎవరూ పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు.

Minister: తేల్చిచెప్పేసిన మంత్రి.. మా కుటుంబీకులెవరూ ఎన్నికల్లో పోటీ చేయరు..

- మంత్రి సతీష్‌ జార్కిహోళి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి నాకు లేదని ప్రజాపనుల శాఖా మంత్రి సతీష్‌ జార్కిహోళి(Minister Satish Jarkiholi) స్పష్టం చేశారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. బెళగావి లేదా చిక్కోడి లోక్‌సభ స్థానాల నుంచి తన కుటుంబానికి చెందిన ఎవరూ పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు అవకాశం లభించనుందన్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం వ్యక్తి ప్రదర్శనగా సాగుతోందని విచారం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను మినహాయిస్తే ఇతర ముఖ్యమంత్రులను ఎవరనీ ఆహ్వానించలేదన్నారు. తనకు ఆహ్వానం వచ్చినా వెళ్ళేది లేదన్నారు. మా పల్లెలో రామమందిరం ఉందని అక్కడే పూజ చేస్తానన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:29 PM