Share News

Lok Sabha Elections: సారీ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక కాఫీలు మాత్రమే!

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:00 PM

విరుదునగర్‌ జిల్లా డీఎంకే జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రతినిధులకు భోజనం అందజేయడం ఆనవాయితీ.

Lok Sabha Elections: సారీ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక కాఫీలు మాత్రమే!

చెన్నై: విరుదునగర్‌ జిల్లా డీఎంకే జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రతినిధులకు భోజనం అందజేయడం ఆనవాయితీ. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థి పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సాత్తూర్‌ రామచంద్రన్‌(Minister Sattur Ramachandran) మాట్లాడుతూ... ఎన్నికలయ్యే వరకు నిర్వహించే సమావేశాల్లో కార్యకర్తలకు కేసరి, కాఫీలు మాత్రమే అందిస్తామని, భోజనాలు అందిస్తే అభ్యర్థుల ఖర్చులో జమ అవుతాయని, కార్యకర్తలు ఈ విషయం గుర్తెరిగి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 01:27 PM