Share News

Faridabad: ఇలాంటి వారికి శూల దండనమే కరెక్ట్.. పాపం నవజాత శిశువును ఏం చేశారంటే

ABN , Publish Date - Mar 02 , 2024 | 02:38 PM

నవజాత శిశువు మరణం హరియాణాలో కలకలం సృష్టించింది. ఆ మగ శిశువు ప్రహారీ గ్రిల్స్‌పై పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్రోండా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి నవజాత శిశువును ఓ భవనం ప్రహరీ గ్రిల్స్‌పై పడేశాడు.

Faridabad: ఇలాంటి వారికి శూల దండనమే కరెక్ట్.. పాపం నవజాత శిశువును ఏం చేశారంటే

ఫరీదాబాద్: నవజాత శిశువు మరణం హరియాణాలో కలకలం సృష్టించింది. ఆ మగ శిశువు ప్రహారీ గ్రిల్స్‌పై పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్రోండా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి నవజాత శిశువును ఓ భవనం ప్రహరీ గ్రిల్స్‌పై పడేశాడు. గ్రిల్స్‌లో చిక్కుకున్న ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఫరీదాబాద్‌లోని బాద్షా ఖాన్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఉద్దేశపూర్వకంగా చంపారా, బతికుండగానే గ్రిల్‌పై పడేశారా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థుల ఆచూకీ కనుక్కోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులే దోషులని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిని మరణశిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 03:07 PM