Share News

Former CM: అయోధ్య తరహాలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:17 PM

అయోధ్యలోని రామజన్మభూమి తరహాలోనే రాష్ట్రంలోని ఆంజనేయస్వామి జన్మస్థలమైన అంజనాద్రిని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) సూచించారు.

Former CM: అయోధ్య తరహాలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలి

- మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలోని రామజన్మభూమి తరహాలోనే రాష్ట్రంలోని ఆంజనేయస్వామి జన్మస్థలమైన అంజనాద్రిని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) సూచించారు. అయోధ్యలో రామమందిరంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ఆయన బెంగళూరు బాలబ్రూయి గెస్ట్‌హౌస్‌ సమీపంలోని మారుతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. గోపాలయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ దేశంలో రామరాజ్య స్థాపనే తమ తదుపరి లక్ష్యమన్నారు. రామమందిర ప్రారంభంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు భక్తి భావంతో పులకించారని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు పరవశించారని అన్నారు.

Updated Date - Jan 23 , 2024 | 12:17 PM