Former Chief Minister: వెనక్కి నడిస్తే కాళ్లకు బలం.. అంటూ మాజీసీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు...
ABN , Publish Date - Apr 02 , 2024 | 10:43 AM
రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ కూటమి నుంచి పనస పండు గుర్తుపై పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam) కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు తన అనుచరులతో కలసి వెళ్లారు.
![Former Chief Minister: వెనక్కి నడిస్తే కాళ్లకు బలం.. అంటూ మాజీసీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు...](https://media.andhrajyothy.com/media/2024/20240326/nani3_4c8326fb85.jpg)
చెన్నై: రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ కూటమి నుంచి పనస పండు గుర్తుపై పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam) కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు తన అనుచరులతో కలసి వెళ్లారు. కలెక్టరేట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఓపీఎస్ రాక కోసం వేచి ఉన్న ఎలకా్ట్రనిక్ మీడియా ప్రతినిధులు, ఓపీఎస్ ముందుకు నడుస్తుండగా మెల్లగా వెనక్కి నడుస్తూ కెమెరాల్లో రికార్డు చేశారు. అప్పుడు వారిని ప్రశ్నించిన ఓపీఎస్, వెనక్కి నడవడం వల్ల కాళ్లకు బలం వస్తుందని, అయితే జాగ్రత్తగా నడవాలని సలహా ఇచ్చారు.
ఇదికూడా చదవండి: Raja: ఎంపీగారు అంతమాట అనేశారేంటో... దేవుడిపై నాకెలాంటి కోపం లేదు!
.....................................