Loke Sabha Poling: కర్ణాటకలో తొలి విడత పూర్తి ..
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:52 AM
ర్ణాటకలో మొదటి విడతలో బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు గ్రామీణ, తుమకూరు, కోలారు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు, చామరాజనగర, హాసన్, ఉడుపి-చిక్కమగళూరు, దక్షిణ కన్నడ లోక్సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది.
బెంగళూరు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): పోలింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ కొన్నిచోట్ల ప్రజలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మహదేశ్వరగుట్ట పరిధిలో స్థానిక సమస్యలపై ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. నచ్చచెప్పేందుకు వచ్చిన అధికారులపైన తిరగబడ్డారు.
పోలింగ్ కేంద్రాన్ని ధ్వంసం చేసి ఈవీఎంలను తగలబెట్టారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి తేజస్వీసూర్య, ఆ పార్టీ నేత సీటీ రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.