Election Code: మాజీ ముఖ్యమంత్రిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు..
ABN , Publish Date - Mar 29 , 2024 | 08:41 AM
రామనాథపురంలో ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై కేసు నమోదు చేసినట్లు కేనికరై పోలీసులు తెలిపారు.
చెన్నై: రామనాథపురంలో ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై కేసు నమోదు చేసినట్లు కేనికరై పోలీసులు తెలిపారు. రామనాధపురంలో పోటీచేస్తున్న నవాజ్ ఘనీ, జయపెరుమాళ్, ఓపీఎస్ ఈనెల 25న కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు దాఖలుచేశారు. ఇందుకోసం వారు తమ మద్దతుదారులతో కలసి ఊరేగింపుగా వెళ్లారు. అందువల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కోడ్ ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆదీశ్వరన్ కేనికరై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఆధారంగా ఒ.పన్నీర్సెల్వం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధరణి మురుగేశన్, అన్నాడీఎంకే అభ్యర్థి జయపెరుమాళ్, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మునియస్వామి, డీఎంకే జిల్లా కార్యదర్శి ఖాదర్బాషా, ముత్తురామలింగం, నవాజ్ ఘనీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.