ED Searches: శరద్ పవార్ మనవడి కంపెనీలో ఈడీ సోదాలు
ABN , Publish Date - Jan 05 , 2024 | 06:36 PM
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మనవడు రోహిత్ పవార్కు (Rohit Pawar) చెందిన బారామతి ఆగ్రో ప్రైవేట్ లిమినెట్ కంపెనీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు.
![ED Searches: శరద్ పవార్ మనవడి కంపెనీలో ఈడీ సోదాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/pawars_8d4c11e396.jpg)
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మనవడు రోహిత్ పవార్కు (Rohit Pawar) చెందిన బారామతి ఆగ్రో ప్రైవేట్ లిమినెట్ కంపెనీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు. దాడులను శరద్ పవార్కు (Sharad Pawar) చెందిన ఎన్సీపీ తీవ్రంగా ఖండించింది. ఇటీవల రోహిత్ పవార్ యువ సంఘర్ష్ యాత్ర చేపట్టారని, దానికి జనం నుంచి వచ్చిన స్పందన ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ఇలా చేస్తుందని విమర్శించింది. ఈ దాడులతో రోహిత్ పవార్ మరింత శక్తిమంతం అవుతారని శరద్ పవార్ వర్గానికి చెందిన నేత క్లైడ్ క్రాస్టో తెలిపారు.
కన్నద్ కో ఆఫరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని రోహిత్ పవార్కు చెందిన బారామతి ఆగ్రో తక్కువ ధరకు కొనుగోలు చేసింది. రూ.50 కోట్లకు కొనుగోలు చేయడంతో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. కొనుగోలుపై దర్యాప్తు చేయాలని ఈడీని బీజేపీ నేత సోమయ్య మరోసారి కోరారు. దీంతో దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి ఈ రోజు బారామతి, పింప్రి, పుణె, ఔరంగబాద్లో సోదాలు నిర్వహించింది.