Share News

Corona Cases: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..

ABN , Publish Date - Jan 01 , 2024 | 01:29 PM

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదుకాగా.. ముగ్గురు మృతి చెందారు. కాగా కోవిడ్ యక్టీవ్ కేసుల సంఖ్య 4,394కు పెరిగింది. అయితే ఇవి గత 228 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం.

Corona Cases: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు నమోదుకాగా.. ముగ్గురు మృతి చెందారు. కాగా కోవిడ్ యక్టీవ్ కేసుల సంఖ్య 4,394కు పెరిగింది. అయితే ఇవి గత 228 రోజుల్లోనే అత్యధిక కేసులు కావడం విశేషం.

కాగా గత 10 రోజుల కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ క్రమంలో రోజురోజుకు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత ఇన్‌ఫెక్షన్ కేసులకు ప్రధాన కారణం కరోనా కొత్త వేరియంట్ JN.1 అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటివల కరోనా సోకిన వారిలో చాలా మంది సులభంగా కోలుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు అన్నారు. దీంతోపాటు అనేక మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిన సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. 2019లో ఇదే సమయంలో కరోనా మహమ్మారి మొదలు కాగా నాలుగేళ్లు దాటినా కూడా ఇప్పటికీ దీని ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఈ నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా కరోనా వ్యాధి బారిన పడ్డారు. అంతేకాదు 5.3 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకి మృత్యువాత చెందారు.

Updated Date - Jan 01 , 2024 | 01:29 PM