Share News

Chennai: మోదీ ఇడ్లీ దుకాణానికి అపూర్వ స్పందన.. అక్కడ రూ. 10కే మూడు..

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:40 AM

స్థానిక కేకేనగర్‌ (వెస్ట్‌) మునుసామి రోడ్డులో బీజేపీ కార్యకర్త నడుపుతున్న ‘మోదీ ఇడ్లీ’కి అపూర్వ స్పందన లభిస్తోంది.

Chennai: మోదీ ఇడ్లీ దుకాణానికి అపూర్వ స్పందన.. అక్కడ రూ. 10కే మూడు..

చెన్నై: స్థానిక కేకేనగర్‌ (వెస్ట్‌) మునుసామి రోడ్డులో బీజేపీ కార్యకర్త నడుపుతున్న ‘మోదీ ఇడ్లీ’కి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రతిరోజూ ఉదయం కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబీకులు, మహిళలు ఆ దుకాణానికి రూ.10కి మూడు ఇడ్లీలను తిని సంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ సౌత్‌ చెన్నై జిల్లా శాఖ కోశాధికారి కేపీ నాగరాజన్‌ సహకారంతో జోనల్‌ కమిటీ నాయకుడు జి.గోపీనాథన్‌ ఈ ఇడ్లీ దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ దుకాణంలో రూ.10లకు 3 ఇడ్లీలు, రూ.5కు వడను విక్రయిస్తున్నారు. శని, ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుండి 8 గంటల వరకు ఈ దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ విషయమై దుకాణ యజమాని గోపీనాథన్‌ మాట్లాడుతూ... గత యేడాది డిసెంబర్‌లో ప్రారంభించిన దుకాణానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతిరోజూ పార్శిళ్లు సహా 80మందికి సరిపోయేలా 280 ఇడ్లీలు విక్రయిస్తున్నానని చెప్పారు. సేవాభావంతో దుకాణాన్ని నడుపుతున్నానని తెలిపారు. దుకాణం ప్రారంభించిన తొలినాళ్లలో విక్రయాలు తక్కువగా ఉండేవని... ఆ తర్వాత నాణ్యమైన ఇడ్లీలు, వడలు విక్రయిస్తున్నట్లు తెలుసుకుని ఉద్యోగులు, కార్మికులు, పేదలు దుకాణం వద్ద బారులు తీరారని చెప్పారు. త్వరలోనే విరుగంబాక్కం శాసనసభ నియోజకవర్గంలో పది ప్రాంతాల్లో మోదీ ఇడ్లీ దుకాణాలను ప్రారంభిస్తానని గోపీనాథన్‌ చెప్పారు. నగరంలో అమ్మా క్యాంటీన్లు మునుపటిలా సక్రమంగా నడపకపోవడం వల్లే మోదీ ఇడ్లీ దుకాణంలో విక్రయాలు పెరుగుతున్నాయని చెప్పారు.

nani4.2.jpg

Updated Date - Feb 26 , 2024 | 11:40 AM