Share News

Chennai: వార్నీ ఎలా జరిగిందబ్బా.. రాష్ట్ర ఎన్నికల అధికారి గుర్తింపుకార్డు మాయం..

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:33 PM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రదసాహు(Chief Electoral Officer Satya Pradasahu) గుర్తింపుకార్డు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుకార్డులు అందజేస్తోంది.

Chennai: వార్నీ ఎలా జరిగిందబ్బా.. రాష్ట్ర ఎన్నికల అధికారి గుర్తింపుకార్డు మాయం..

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రదసాహు(Chief Electoral Officer Satya Pradasahu) గుర్తింపుకార్డు కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుకార్డులు అందజేస్తోంది. ప్రస్తుతం ఐడీ కార్డు అప్‌డేట్‌ చేసేందుకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని నిర్ణయించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రదసాహు, ఐడీ కార్డును తపాలా ద్వారా ఢిల్లీకి పంపించాలని తన అసిస్టెంట్‌ శరవణన్‌ తెలిపినట్లు సమాచారం. దీంతో, శరవణన్‌ ఐడీ కార్డును పంపేందుకు తపాలా కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కార్డు ఎక్కడో జారిపోయినట్లు తెలిసింది. దీంతో, ఐటీ కార్డు కనిపించడం లేదంటూ ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రదసాహు తరఫున పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - Feb 01 , 2024 | 12:33 PM