Share News

FCU: సోషల్ మీడియాపై కేంద్రం గట్టి నిఘా.. ఐటీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక అంతే

ABN , Publish Date - Mar 20 , 2024 | 08:46 PM

సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కంటెంట్‌పై గట్టి నిఘా ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. కంటెంట్ పర్యవేక్షణకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్(FCU)ని జారీ చేసింది. ఈ చర్య ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉంది.

FCU: సోషల్ మీడియాపై కేంద్రం గట్టి నిఘా.. ఐటీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక అంతే

ఢిల్లీ: అసలే ఎన్నికల కాలం. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై పెట్టే పోస్టులు, వీడియోలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీనికి తోడు ఏఐ రాకతో వాయిస్‌లు మార్చడం, ప్రత్యర్థులను భయపెట్టడం, ప్రజలను మభ్యపెట్టడం ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి.

వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నాలాభం లేకుండా పోతోంది. ఈ మధ్యే ఏఐతో హీరోయిన్ రష్మిక మందన్న వీడియోను మార్ఫింగ్ చేసిన ఉదంతం బయటపడింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో ఎన్నో కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయి. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.


ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కంటెంట్‌పై గట్టి నిఘా ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. కంటెంట్ పర్యవేక్షణకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్(FCU)ని జారీ చేసింది. ఈ చర్య ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉంది. నోటిఫికేషన్‌ని ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ యూనిట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వ్యాపారానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమయ్యే సమాచారం కచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనల్లో ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2024 | 08:47 PM