Vijayakanth: కెప్టెన్ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు
ABN , Publish Date - Jan 07 , 2024 | 10:46 AM
తమిళ చిత్రపరిశ్రమలో మానవతావాదిగా గుర్తింపుపొందిన సినీయర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెప్ విజయకాంత్(Captep Vijayakanth) గత నెల 28న అనారోగ్యం కారణంగా మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలోనే సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
![Vijayakanth: కెప్టెన్ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు](https://media.andhrajyothy.com/media/2023/20231205/nani7_5e98b2b5ba.jpg)
చెన్నై: తమిళ చిత్రపరిశ్రమలో మానవతావాదిగా గుర్తింపుపొందిన సినీయర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెప్ విజయకాంత్(Captep Vijayakanth) గత నెల 28న అనారోగ్యం కారణంగా మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలోనే సినీ ప్రముఖులు పాల్గొన్నారు. విజయ్ వంటి అగ్రహీరో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. అయితే, కెప్టెన్ అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు పాల్గొనలేదు. అలాగే, పలువురు చెన్నైలో ఉన్నప్పటికీ అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. కానీ, ఇపుడు కోయంబేడు(Koyambedu)లోని ఆయన సమాధి వద్దకు, సాలిగ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. ఇలాంటి వారిపై సినీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మనిషి చనిపోయినపుడు వెళ్లి కడచూపు చూసి కుటుంబ సభ్యులను ఓదార్చాల్సిన నటీనటులు ఇపుడు సమాధి వద్దకు క్యూ కట్టడాన్ని తప్పుబడుతున్నారు. కెప్టెన్ సమాధి వద్దకు వెళ్ళిన వారిలో శరత్ కుమార్, శశికుమార్, శివకుమార్, సూర్య, కార్తీ, జయం రవి, అరుణ్ విజయ్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేష్, దర్శక నటుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఇలా అనేక మంది ఉన్నారు.