Share News

Assam: రాహుల్‌పై విరుచుకుపడ్డ హిమంతా.. అవినీతిలో కాంగ్రెస్ మించినవారు లేరంటూ విసుర్లు

ABN , Publish Date - Jan 20 , 2024 | 04:21 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ(Himanth Biswa Sarma) మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ అసోంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

Assam: రాహుల్‌పై విరుచుకుపడ్డ హిమంతా.. అవినీతిలో కాంగ్రెస్ మించినవారు లేరంటూ విసుర్లు

గౌహతి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ(Himanth Biswa Sarma) మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ అసోంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. అవినీతిలో కాంగ్రెస్‌ని మించిన వారు లేరని విమర్శించారు. గాంధీ కుటుంబం పూర్తిగా అవినీతిమయమైందని..

యూపీఏ హయాంలో వారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. వారి నుంచి వచ్చే తిట్లను ఆశీర్వాదంగా భావిస్తానని.. ఆ తిట్లు తనను మరింత శక్తిమంతంగా మారుస్తాయని అన్నారు. బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్ స్కాం, 2 జీ స్కాం, బొగ్గు కుంభ కోణం ఇలా యూపీఐ హయాంలో ఎన్నో జరిగాయని పోస్ట్‌లో వివరించారు.

Updated Date - Jan 20 , 2024 | 04:23 PM