Share News

BJP Poll List: 5వ జాబితా ప్రకటించిన బీజేపీ.. కంగనా రనౌత్ ఎక్కడి నుంచంటే?

ABN , Publish Date - Mar 24 , 2024 | 09:59 PM

కేంద్రంలోని అధికార బీజేపీ 5వ విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో జాబితాను వెల్లడించింది. పార్టీలో కొత్తగా చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, రంజిత్ చౌతాలాకు సీట్లు దక్కాయి. వారితో పాటు కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, నటి కంగనా రనౌత్‌లకు బీజేపీ సీట్లు ఇచ్చింది. వరుణ్‌గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది.

BJP Poll List: 5వ జాబితా ప్రకటించిన బీజేపీ.. కంగనా రనౌత్ ఎక్కడి నుంచంటే?

న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార బీజేపీ 5వ విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో జాబితాను వెల్లడించింది. పార్టీలో కొత్తగా చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, రంజిత్ చౌతాలాకు సీట్లు దక్కాయి. వారితో పాటు కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, నటి కంగనా రనౌత్‌లకు బీజేపీ సీట్లు ఇచ్చింది. వరుణ్‌గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. అయితే వరుణ్ గాంధీని పార్టీ పక్కనబెట్టింది. వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్న పిలిభిత్ స్థానాన్ని ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన జితిన్ ప్రసాద్‌కు కేటాయించింది.

ఇక కేరళలోని వాయనాడ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై సీనియర్ నేత కే.సురేంద్రన్‌ను బీజేపీ బరిలోకి దించింది. నటి కంగనా రనౌత్‌కు సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇటీవలే బీజేపీలో చేరిన కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యకు బెంగాల్‌లోని తామ్‌లుక్ సీటు కేటాయించింది. ఇక ఒడిశాలో బీజూ జనతాదళ్‌ పార్టీతో పొత్తు ఉండడంతో సంభల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్రలను పోటీకి నిలబెట్టింది.

Updated Date - Mar 24 , 2024 | 10:01 PM