Share News

Love Triangle: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు హోటల్ రూంలోకి వెళ్లాక షాకింగ్ సీన్

ABN , Publish Date - Feb 06 , 2024 | 07:20 PM

‘ప్రేమ’ అనేది ఎంతో పవిత్రమైంది. అదృష్టం ఉంటే తప్ప ఇది అందరికీ దక్కదు. కానీ.. ప్రస్తుత తరంలోని కొందరు యువతీ యువకులు దీనిని భ్రష్టు పట్టించేశారు. తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం ప్రేమ నాటకాలు ఆడుతున్నారు. ‘ప్రే’మించుకున్నామా.. ‘మ’రచిపోయామా అన్నట్టుగా యువత తయారైంది.

Love Triangle: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇద్దరు హోటల్ రూంలోకి వెళ్లాక షాకింగ్ సీన్

‘ప్రేమ’ అనేది ఎంతో పవిత్రమైంది. అదృష్టం ఉంటే తప్ప ఇది అందరికీ దక్కదు. కానీ.. ప్రస్తుత తరంలోని కొందరు యువతీ యువకులు దీనిని భ్రష్టు పట్టించేశారు. తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం ప్రేమ నాటకాలు ఆడుతున్నారు. ‘ప్రే’మించుకున్నామా.. ‘మ’రచిపోయామా అన్నట్టుగా యువత తయారైంది. ప్రేమని ఇలా లెక్క చేయకపోవడం వల్లే కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా అస్సాంలో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. ‘ప్రేమ’ పేరుతో ఓ అమ్మాయి చేసిన పనికి.. ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

సందీప్ కాంబ్లీ (42) అనే వ్యక్తి పూణెలో కార్ డీలర్‌గా పని చేస్తున్నాడు. గతేడాదిలో అతనికి కోల్‌కతా ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో పని చేసే అంజలి షాతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారడంతో.. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అయితే.. ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. అంజలి అప్పటికే బికాష్ షా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఆమె బికాష్‌తో ప్రేమాయణం కొనసాగిస్తూనే.. సందీప్‌తో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. కట్ చేస్తే.. కొంతకాలం గడిచాక సందీప్‌తో అంజలి తెగదెంపులు చేసుకుంది. ఇకపై తామిద్దరం కలిసి ఉండలేమని, తనని మర్చిపోవాలని అంజలి చెప్పింది. అందుకు సందీప్ ఒప్పుకోలేదు. ఆమెని గాఢంగా ప్రేమిస్తున్న అతను.. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. లేకపోతే.. తామిద్దరం కలిసి ఏకాంతంగా గడిపిన క్షణాల ఫోటోలను నెట్టింట్లో లీక్ చేస్తానని బెదిరించాడు.


సందీప్ బెదిరింపుతో బెదిరిపోయిన అంజలి.. ఏం చేయాలో పాలుపోక మొత్తం విషయాన్ని తన ప్రియుడు బికాష్‌కి చెప్పేసింది. అప్పుడే వీళ్లిద్దరు ఒక ప్లాన్ వేశారు. సందీప్ ఫోన్‌లో ఉన్న ఇంటిమేట్ ఫోటోలను ఎలాగైనా సంపాదించాలని ఓ ప్రణాళిక రచించారు. ప్లాన్ ప్రకారం.. ఫిబ్రవరి 4వ తేదీన తనని కలిసేందుకు గౌహతికి రమ్మని సందీప్‌ని పిలిచింది. ఒక హోటల్‌లో ఓ రూమ్‌ని బుక్ చేసింది. అదే హోటల్‌లో బికాష్ కూడా సెపరేట్ గదిని బుక్ చేశాడు. సందీప్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే.. వెనకాల నుంచి బికాష్ వచ్చి అతనిపై దాడి చేశాడు. అప్పుడు అంజలి, బికాష్ కలిసి.. సందీప్ వద్ద ఉన్న ఫోన్‌ని లాక్కునేందుకు ప్రయత్నించారు. సందీప్ ప్రతిఘటించడంతో.. వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సందీప్‌ని బికాష్ గట్టిగా కొట్టడంతో.. తీవ్ర రక్తస్రావమై అతడు చనిపోయాడు. దీంతో.. భయంతో అంజలి, బికాష్ పారిపోయారు.

రాత్రి 9:15 గంటల సమయంలో ఫ్లైట్ ఎక్కి కోల్‌కతాకు పారిపోవాలని అంజలి, బికాష్ ప్లాన్ వేశారు. అయితే.. ఇంతలోనే హోటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితుల్ని గుర్తించిన పోలీసులు.. వాళ్లు ఎక్కడికి పారిపోతున్నారన్న సమాచారాన్ని రాబట్టారు. ఫైనల్‌గా కోల్‌కతాకు ఫ్లైట్‌లో వెళ్తున్నారన్న విషయం తెలిసి.. సాయంత్రం 6.30 గంటలకే వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Updated Date - Feb 06 , 2024 | 07:20 PM