Share News

Prince William: ఆస్పత్రిలో చేరిన ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్..అసలేమైంది?

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:31 PM

ప్రిన్స్ విలియం భార్యకు క్యాన్సర్ సోకిందని ఇటీవల వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఎందుకంటే తాజాగా ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్(42) పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్యాలెస్ ప్రకటించింది.

Prince William: ఆస్పత్రిలో చేరిన ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్..అసలేమైంది?

ప్రిన్స్ విలియం(Prince William) భార్య ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్(42)(Kate Middleton) పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు వారాల పాటు ఆస్పత్రిలో ఉంటారని కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రకటించింది. ఆమె నిన్న రాయల్ హైనెస్ ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ది లండన్ క్లినిక్‌లో చేరగా శస్త్రచికిత్స విజయవంతమైనట్లు ప్యాలెస్ తెలిపింది. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ చివరిసారిగా క్రిస్మస్ సందర్భంగా సాండ్రింగ్‌హామ్‌లో వారి ముగ్గురు పిల్లలు ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ షార్లెట్, ప్రిన్స్ లూయిస్‌లతో కలిసి కనిపించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ayodhya Ram Temple: రామాలయం నిర్మాణానికి శుభం కార్డు... నిర్మాణ కమిటీ చైర్మన్ సంచలన ప్రకటన

ఈ క్రమంలో వేల్స్ యువరాణి తన రాబోయే కార్యక్రమాలను వాయిదా వేయాల్సి వచ్చినందుకు ఆందోళన చెందొద్దని కోరారు. ఈ సమస్య క్యాన్సర్ కాదని.. ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా సూచించారు. దీంతోపాటు ఆమె వైద్య సమాచారం ప్రైవేట్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రిన్సెస్ కేట్ విండ్సర్‌లోని ఇంట్లో కోలుకోవాలని భావిస్తున్నారు. ప్రిన్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ లండన్‌లోని వారి మునుపటి ప్రాంతం నుంచి 2022లో విండ్సర్‌కు మకాం మార్చారు.

Updated Date - Jan 17 , 2024 | 08:31 PM