Share News

Maldives: మాల్దీవులకు మరో షాకింగ్ న్యూస్..ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేత

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:23 AM

భారత్‌తోపాటు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవులపై భారత్ ఆగ్రహం ఇంకా తగ్గడం లేదు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ విమానాల టికెట్ బుకింగ్ సంస్థ మాల్దీవులకు ఫైట్స్ టెకెట్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Maldives: మాల్దీవులకు మరో షాకింగ్ న్యూస్..ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేత

మాల్దీవుల(Maldives) దేశంలోని పలువురు మంత్రులు భారత్‌తోపాటు ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిన్న భారతీయులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున బైకాట్ మాల్దీవ్స్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భయాందోళన చెందిన మాల్దీవుల ప్రభుత్వం ఆ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌కు చెందిన ఓ విమానాల టికెట్ బుకింగ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.


దేశంలోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ EaseMyTrip మాల్దీవులకు తన అన్ని విమాన టికెట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, CEO నిశాంత్ పిట్టి స్వయంగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేస్తూ వెల్లడించారు. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిశాంత్ పిట్టి చెప్పారు.

నిజానికి ఈ వ్యవహారమంతా ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మొదలైంది. లక్షద్వీప్‌లో పర్యటించిన అనంతరం ప్రధాని మోదీ అక్కడి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో పాటు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి అనేక మంది తరలి రావాలని భారతీయులకు విజ్ఞప్తి చేశాడు. దీని తర్వాత మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా ప్రధాని మోదీ పోస్ట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ట్వీట్‌పై విమర్శలు రావడంతో దాన్ని కూడా తొలగించారు. భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాల్దీవుల ప్రభుత్వం ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి మరియం షియునాతో పాటు మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్‌లను సస్పెండ్ చేసింది.

Updated Date - Jan 08 , 2024 | 11:23 AM