Share News

Hijack: సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ప్రమాదంలో భారతీయ సిబ్బంది!

ABN , Publish Date - Jan 05 , 2024 | 02:29 PM

భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక హైజాక్ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 మంది సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను సోమాలియా(Somalia) తీరానికి సమీపంలో హైజాక్(Ship Hijack) చేశారు.

Hijack: సోమాలియా తీరంలో నౌక హైజాక్.. ప్రమాదంలో భారతీయ సిబ్బంది!

సోమాలియా: భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక హైజాక్ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 మంది సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను సోమాలియా(Somalia) తీరానికి సమీపంలో హైజాక్(Ship Hijack) చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడం, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి భారత నౌకాదళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నైని మోహరించారు.

నౌకను MV LILA NORFOLKగా గుర్తించినట్లు భారత నావికాదళం తెలిపింది. గురువారం సాయంత్రం హైజాక్ కు గురైనట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎంతమంది భారతీయులు ఉన్నారో స్పష్టంగా తెలియరాలేదు. షిప్ పై నిరంతర నిఘా ఉంచినట్లు నావికాదళ వర్గాలు తెలిపాయి.

"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"

Updated Date - Jan 05 , 2024 | 02:47 PM