Share News

Extramarital Affair: మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..

ABN , Publish Date - May 08 , 2024 | 03:22 PM

వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయని, ప్రాణాలను సైతం బలిగొంటాయని చెప్పడానికి.. ఈ తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పరాయి వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం..

Extramarital Affair: మరీ ఇంత నీచమా.. వివాహేతర సంబంధం కోసం కూతురిని..

వివాహేతర సంబంధాలు (Extramarital Affairs) ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయని, ప్రాణాలను సైతం బలిగొంటాయని చెప్పడానికి.. ఈ తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పరాయి వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం.. ఆమె కూతురినే బలి తీసుకుంది. ఆమె అల్లుడిని కూడా ఆసుపత్రిపాలయ్యేలా చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘాజియాబాద్‌లో (Ghaziabad) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


సీబీఐ అధికారులమంటూ రూ. 91.64 లక్షలు దోచేశారు

ఘాజియాబాద్‌లోని ఇందిరాపురంలో చంపాదేవి (Champa Devi) అనే మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమెకు 18 ఏళ్ల జ్యోతి దేవి (Jyoti Devi) అనే కూతురు ఉంది. జ్యోతిని ఉత్తరప్రదేశ్‌లోని బబ్రాలా టౌన్‌లో నివాసముంటున్న లలితేష్‌కి ఇచ్చి వివాహం చేశారు. కట్ చేస్తే.. చంపాదేవి క్యాన్సర్ బారిన పడటంతో, తల్లిని చూసుకునేందుకు జ్యోతి తన భర్తతో కలిసి ఇందిరాపురంకి వెళ్లింది. కొన్ని రోజుల నుంచి వాళ్లిద్దరు చంపాదేవి బాగోగులు చూసుకుంటున్నారు. అయితే.. మంగళవారం బాబీ (Bobby) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి చంపాదేవి ఇంటికి వెళ్లాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకొని.. చంపాదేవిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తన తల్లిని కాపాడుకునేందుకు జ్యోతి అడ్డుపడింది. ఆమె భర్త లలితేష్ సైతం అతనితో గొడవకు దిగాడు. ఈ గొడవలో జ్యోతిపై బాబీ కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. లలితేష్‌కి కూడా గాయాలయ్యాయి. ఈ దాడి అనంతరం బాబీ, అతని స్నేహితుడు పారిపోయారు. అటు.. జ్యోతిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

చికెన్‌రైస్‏లో విషం కలిపి.. తాతను హతమార్చిన మనవడు

అసలు బాబీ ఎవరు? ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు? అని ఆరా తీయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంపాదేవితో బాబీకి వివాహేతర సంబంధం ఉందని తేలింది. నిజానికి.. చంపాదేవి రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి భర్త చనిపోగా, రెండో భర్త మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో.. ఆమె బాబీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. ఓ కేసులో అతడు జైలుపాలయ్యాడు. అతడు జైల్లో ఉన్నప్పుడు చంపాదేవి మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. జైలు నుంచి విడుదలయ్యాక బాబీకి ఈ విషయం తెలిసి.. చంపాదేవిపై కోపం పెంచుకున్నాడు. ఆమెని చంపాలని నిర్ణయించుకొని, తన స్నేహితునితో కలిసి ఈ దాడికి పాల్పడినట్టు పోలీసు విచారణలో తేలింది. ఇప్పటికే పోలీసులు బాబీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని స్నేహితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - May 08 , 2024 | 03:22 PM