Share News

Maharashtra: తల్లి కాదు కసాయి.. ప్రియుడితో పారిపోవడం కోసం ఇద్దరు పిల్లల్ని..

ABN , Publish Date - Apr 10 , 2024 | 07:36 AM

తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి తన పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది. ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపుతుంది. అందుకే.. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. కానీ.. అందరూ తల్లులు అలా ఉండరు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాక్షస అవతారం ఎత్తుతుంటారు.

Maharashtra: తల్లి కాదు కసాయి.. ప్రియుడితో పారిపోవడం కోసం ఇద్దరు పిల్లల్ని..

తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి తన పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతుంది. ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. తాను పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపుతుంది. అందుకే.. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. కానీ.. అందరూ తల్లులు అలా ఉండరు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాక్షస అవతారం ఎత్తుతుంటారు. పిల్లల్ని చంపుకోవడానికైనా వెనుకాడరు. ఇప్పుడు ఓ మహిళ కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. ప్రియుడితో పారిపోవడం.. నవమాసాలు మోసి పెంచిన తన ఇద్దరు పిల్లల్ని హతమార్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Crime: ఫార్చునర్ కారు కట్నం కింద ఇవ్వలేదని ఇంత ఘోరమా?.. పెళ్లైన రెండేళ్లలోపే భర్త, అత్తమామలు చేసిన దారుణమిదీ..!

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన షీతల్ పోలే(25)కు (Sheetal Pole) స్థానికంగా ఉండే సదానంద్ పోలేతో (Sadanand Pole) కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. కట్ చేస్తే.. మార్చి 31వ తేదీన సదానంద్ సాయంత్రం 4:30 గంటలకు వీక్లీ మార్కెట్‌కి వెళ్లాడు. కొద్దిసేపు తర్వాత తన కుమారుల కోసం స్వీట్స్, చెప్పులు తీసుకొని ఇంటికి తిరిగొచ్చాడు. తనకు పిల్లలు కనిపించకపోవడంతో.. పిల్లలు ఎక్కడున్నారని ప్రాంగణంలో పని చేసుకుంటున్న భార్య షీతల్‌ని అడిగాడు. వాళ్లు ఇంట్లో పడుకున్నారని ఆమె నుంచి సమాధానం రావడంతో.. లోపలికి వెళ్లి చూశాడు. తీరా చూస్తే.. పిల్లలు విగతజీవుల్లా పడి ఉన్నారు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదటగా తల్లిదండ్రుల్ని విచారించారు. తన భర్త మార్కెట్‌కి వెళ్లిన తర్వాత పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారని.. వాళ్లు బయటకు రావడం గానీ, ఇంట్లోకి ఇతరులు వెళ్లడం గానీ జరగలేదని షీతల్ సమాధానం ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోజుల తరబడి సదానంద్, శీతల్‌ని విచారించినా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు, కేసు ముందుకు సాగలేదు. ఆ తర్వాత వారి వివాహం, ఇతర వ్యక్తిగత వివరాలను శోధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. షీతల్ ఫోన్‌ని పరిశీలించగా.. సాయినాథ్ జాదవ్‌తో ఆమె తరచూ టచ్‌లోనే ఉంటోందన్న బండారం బయటపడింది.

Electoral Officer: కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి... శవంగా గుర్తింపు

అప్పుడు షీతల్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా.. ఫైనల్‌గా తానే తన పిల్లల్ని చంపానని షీతల్ ఒప్పుకుంది. పెళ్లికి ముందు నుంచే తనకు సాయినాథ్‌తో ఎఫైర్ ఉందని, వైవాహిక జీవితంతో విసుగుచెంది తాను ప్రియుడితో వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నానని ఆమె పేర్కొంది. అయితే.. తన ప్లాన్‌కి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి, టవల్‌తో ఊపిరి ఆడకుండా వారిని చంపేశానని తెలిపింది. తన భర్త మార్కెట్‌కు వెళ్లిన సమయంలో తన పిల్లల్ని హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. దీంతో.. పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 07:38 AM