Share News

Hyderabad: భార్యతో విడాకులు ఇప్పించాడని అక్కసు.. బావమరిది హత్య

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:05 PM

కుటుంబ తగాదాల కారణంగా బావమరిదిని అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బహదూర్‌పురా పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.

Hyderabad: భార్యతో విడాకులు ఇప్పించాడని అక్కసు.. బావమరిది హత్య

హైదరాబాద్: కుటుంబ తగాదాల కారణంగా బావమరిదిని అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బహదూర్‌పురా పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రఘునాథ్‌(Inspector Raghunath) తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌ నంది ముసల్లైగూడకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌(28) కుట్టుమిషన్ల మెకానిక్‌. తన చెల్లికి అదే ప్రాంతానికి చెందిన షకీల్‌ అహ్మద్‌తో వివాహం చేశారు. తరచూ గొడవలు జరుగుతుండడంతో అహ్మద్‌ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం ఖులా(విడాకులు) ఇచ్చింది. విడాకులకు బావమరిది కారణమని అహ్మద్‌ కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో నందిముస్లైగూడ రోడ్డుపై రషీద్‌తో వాగ్వాదానికి దిగాడు. అందరూ చూస్తుండగానే తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. ప్రజలు తేరుకునేలోపే అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటనా స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్య సందర్శించారు. బహదూర్‌పురా పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Congress: కాంగ్రెస్‌ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ల నియామకం

Updated Date - Apr 04 , 2024 | 01:05 PM