Share News

Stock Market Updates: వారాంతం తొలి రోజు నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:14 PM

దేశీయ స్టాక్ మార్కెట్(stock market) వారాంతంలో మొదటి రోజున సోమవారం బలహీనంగా ప్రారంభమైంది. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు తగ్గాయో ఇప్పుడు చుద్దాం.

Stock Market Updates: వారాంతం తొలి రోజు నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్(stock market) వారాంతంలో మొదటి రోజున సోమవారం బలహీనంగా ప్రారంభమైంది. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 336 పాయింట్లు పడిపోయి 72,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 85 పాయింట్లు పతనమైంది. ఇండెక్స్ 22,120 స్థాయికి వచ్చింది. ఐటీ, బ్యాంకింగ్‌, ఆటో రంగాల్లో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 114, 304 పాయింట్లు పతనమయ్యాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bank Holidays March 2024: మార్చి 2024లో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా..చూసుకుని వెళ్లండి


దీంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, భారతి ఎయిర్‌టెల్ కంపెనీల స్టాక్స్ టాప్(top) 5 నష్టాల్లో ఉండగా..లార్సెన్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైస్, అదానీ పోర్ట్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. మరోవైపు టెక్స్‌టైల్, రైల్వే, పవర్, డిఫెన్స్ షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది. కానీ షుగర్, రియల్ ఎస్టేట్, పేపర్, పెయింట్ రంగాల్లో క్షీణత నమోదైంది.

మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్(global market) నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలతోపాటు పలు అంశాల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 26 , 2024 | 01:16 PM