Stock Market: రోజంతా ఒడిదుడుకుల్లోనే.. స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
ABN , Publish Date - May 21 , 2024 | 04:13 PM
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎన్నికల నేపథ్యంలో దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల్లోనే కదలాడాయి. లాభనష్టాలు దోబూచులాడాయి. ఈ వారంలో ట్రేడింగ్కు తొలి రోజు అయిన ఈ రోజు (మంగళవారం) సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయింది.
![Stock Market: రోజంతా ఒడిదుడుకుల్లోనే.. స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!](https://media.andhrajyothy.com/media/2024/20240511/bse_8fa8ef76c4.jpg)
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఎన్నికల నేపథ్యంలో దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల్లోనే కదలాడాయి. లాభనష్టాలు దోబూచులాడాయి. ఈ వారంలో ట్రేడింగ్కు తొలి రోజు అయిన ఈ రోజు (మంగళవారం) సెన్సెక్స్ స్వల్పంగా నష్టపోయింది. అలాగే యూరప్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ఈ రోజును ప్రారంభించాయి. (Business News).
గత వారం ముగింపు (74,005)తో పోల్చితే దాదాపు 150 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అనిశ్చితిలోనే కదలాడింది. మంగళవారం 73,762-74,189 శ్రేణి మధ్యనే కదలాడింది. చివరకు 52 పాయింట్ల నష్టంతో 73,953 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ మాత్రం స్వల్ప లాభంతో ముగిసింది. 27 పాయింట్ల లాభంతో 22,529 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 199 పాయింట్లు ఆర్జించింది.
బాలకృష్ణ ఇండస్ట్రీస్, వేదాంత, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. సిటీ యూనియన్ బ్యాంక్, ఆస్ట్రాల్, ఎమ్సీఎక్స్ ఇండియా, కమిన్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 82.30 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Gold and Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరుకున్నాయంటే
భారత జీడీపీ వృద్ధి రేటు 7%: ఇండ్రా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..