Vratika Gupta: రూ.116 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసిన ఫ్యాషన్ డిజైనర్
ABN , Publish Date - Jan 13 , 2024 | 01:02 PM
ముంబై లోయర్ పరేల్లో గల ‘త్రి సిక్ట్సీ వెస్ట్’ లగ్జరీ టవర్స్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మైసన్ సియా హోమ్ డెకార్ కంపెనీ ఓనర్, ఫ్యాషన్ డిజైనర్ వ్రాతికా గుప్తా రూ.116.42తో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు.
ముంబై: ముంబై లోయర్ పరేల్లో గల ‘త్రి సిక్ట్సీ వెస్ట్’ (Three Sixty West) లగ్జరీ ట్విన్ టవర్స్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. టవర్స్లో (Towers) ఒక్కో ప్లాట్ రూ.కోట్లలో పలుకుతుంది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఏం చక్కా ఇంటి నుంచి సముద్రాన్ని చూసేయచ్చు. డి మార్ట్ వ్యవస్థాపకులు రాధాకృష్ణ దమాని కుటుంబ సభ్యులు, స్నేహితులు 28 ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన రూ.1238 కోట్లతో ఆ కొనుగోలు ప్రక్రియ జరిగింది. ఒక్కో ఫ్లాట్ రూ.44.21 కోట్లు పలికింది.
రూ.5.82 కోట్లతో రిజిష్ట్రేషన్
మైసన్ సియా హోమ్ డెకార్ కంపెనీ ఓనర్, ఫ్యాషన్ డిజైనర్ వ్రాతికా గుప్తా త్రి సిక్ట్సీ వెస్ట్ టవర్స్లో రూ.116.42తో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఆ ఫ్లాట్ 12,138 స్క్వేర్ ఫీట్లతో విశాలంగా ఉంది. ఈ నెల 7వ తేదీన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా రూ.5.82 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారని తెలిసింది. ఈ సంవత్సరం ఇల్లు కోసం రూ.100 కోట్లకు పైగా వెచ్చించిన తొలి వ్యక్తి వ్రాతిక గుప్తా అని ఇండెక్స్ టాప్.కామ్ పేర్కొంది.
ఫ్యాషన్ డిజైనర్ టు హోమ్ డెకర్ ఓనర్
నిఫ్ట్లో వ్రాతిక గుప్తా ఫ్యాషన్ టెక్నాలజీ పూర్తి చేశారు. 2009 నుంచి 2011 వరకు అంజుమన్ ఫ్యాషన్ లిమిటెడ్ కంపెనీలో అపెరల్ డిజైనర్గా పనిచేశారు. 2011 నుంచి 2016 వరకు టూ వైట్ బర్డ్స్ కంపెనీలో డిజైన్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. తర్వాత నకుల్ అగర్వాల్ అనే వ్యక్తిని పెళ్లితో జరిగింది. 2017లో భర్తతో కలిసి వ్రాతిక అండ్ నకుల్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. 2022లో మైసన్ సియా అనే లగ్జరీ హోమ్ డెకర్ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా పెట్టి ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.