Share News

Amaravathi: జగన్‌తో ఉంటేనే రాజకీయ మనుగడన్న వైవీ సుబ్బారెడ్డి

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:45 PM

సీఎం జగన్‌(CM Jagan)తో ఉంటేనే ఎవరికైనా రాజకీయ మనుగడ ఉంటుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నారు.

Amaravathi: జగన్‌తో ఉంటేనే రాజకీయ మనుగడన్న వైవీ సుబ్బారెడ్డి

అమరావతి: సీఎం జగన్‌(CM Jagan)తో ఉంటేనే ఎవరికైనా రాజకీయ మనుగడ ఉంటుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించిందని తెలిపారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలంతా జగన్ వెంటే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవవమయిందని పేర్కొన్నారు.

"టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశాం. మొత్తం స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. మా పార్టీ నుండి వెళ్లిన నేతలు తిరిగివస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉండే నేతలకు రాజకీయ మనుగడ ఉండదు. సీఎం జగన్ వెంటే జనం ఉన్నారు" అని సుబ్బారెడ్డి కామెంట్స్ చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 03:46 PM