Share News

Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:16 PM

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ జరుగుతుంది.

Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

హైదరాబాద్, ఏప్రిల్ 30: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ జరుగుతుంది. 2013 నుంచి ఇప్పటి వరకు సీబీఐ కోర్టులో ఏడుగురు జడ్జిల బదిలీ అయ్యారు.

TS SSC Supplementary Exam 2024: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

అయితే 2022, మే 4వ తేదీ నుంచి సీబీఐ కోర్టు జడ్జి సిహెచ్ రమేష్ బాబు ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్నారు. ఇక తీర్పు వెల్లడించాల్సిన సమయంలో ఆయన సైతం బదిలీ అయ్యారు. దీంతో 130 డిశ్చార్జి పిటిషన్లపై మళ్లీ మొదటి నుంచి వాదనలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు హైకోర్టు గడువు విధించింది.


LokSabha Elections: ఎంపీ గారి రాసలీలలు.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

అయితే అనారోగ్యం కారణంగా తీర్పు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి హైకోర్టుకు వెల్లడించారు. దీంతో వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది.

Read latest National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 04:16 PM