Share News

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:30 AM

విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు.

AP News: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు

విజయనగరం: విజయనగరం వైసీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైసీపీ నేతలు తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు పిల్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పార్టీకి నేతలు రాజీనామా లేఖలు పంపారు. మంత్రి బొత్స బుజ్జగించినా అసమ్మతి నేతలు పట్టించుకోలేదు.

గౌరవం, మర్యాద లేని వైసీపీ కన్నా టీడీపీ వెయ్యి రెట్లు మిన్న అని వైసీపీ అసమ్మతి నేతలు అంటున్నారు. ఇంత వరకూ వీరభధ్రస్వామి దౌర్జన్యాలు, అక్రమాలు భరించామని.. ఇక మీదట కుదరదని నేతలు తేల్చి చెప్పారు. విజయనగరంలో వైసీపీ పతనమైపోతోందని పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్పినా ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన పది వేల మందితో అశోక్ గజపతిరాజు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని పిల్లా విజయకుమార్ , అవనాపు విజయ్ స్ఫష్టం చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 11:30 AM