Share News

YCP: షాకింగ్.. అంతరాష్ట్ర దొంగల ముఠా నాయకుడిగా వైసీపీ నేత

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:55 PM

వైసీపీ నేతలు దౌర్జన్యాలు, దందాలే కాదు.. అంతరాష్ట్ర దొంగల ముఠా నేతలుగా కూడా మారుతున్నారు. అధికారం పోతే ఇక వస్తుందో రాదోనన్న భయమో మరొకటో కానీ వైసీపీ నేతలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. తాజాగా హిందూపురం వైసీపీ కీలక నేత ఫరూక్.. అంతరాష్ట్ర దొంగల ముఠా నేతగా మారారన్న విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

YCP: షాకింగ్.. అంతరాష్ట్ర దొంగల ముఠా నాయకుడిగా వైసీపీ నేత

అనంతపురం: వైసీపీ నేతలు దౌర్జన్యాలు, దందాలే కాదు.. అంతరాష్ట్ర దొంగల ముఠా నేతలుగా కూడా మారుతున్నారు. అధికారం పోతే ఇక వస్తుందో రాదోనన్న భయమో మరొకటో కానీ వైసీపీ నేతలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. తాజాగా హిందూపురం వైసీపీ కీలక నేత ఫరూక్.. అంతరాష్ట్ర దొంగల ముఠా నేతగా మారారన్న విషయం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

రహమత్ పురానికి చెందిన ఫరూక్.. వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. పశు మాంసం విక్రయంతో పాటు దోపిడీలు, దొంగతనాలకు హర్యానా యువకుల ముఠాను వైసీపీ నేత రంగంలోకి దింపాడు. ఆదోని పోలీసుల విచారణలో వైసీపీ నేత దొంగల ముఠా నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఫరూక్‌ను ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. రాయలసీమకు చెందిన కీలక మంత్రి ఫోన్ కాల్‌తో ఫరూక్‌ను పోలీసులు వదిలి వేశారు. ఫరూక్ పరారీలో ఉన్నారని కర్నూలు పోలీసులు చెబుతున్నారు. హిందూపురంలో వైసీపీ కార్యక్రమాల్లో హర్యానా దొంగల ముఠా నేత ఫరూక్ చురుకుగా పాల్గొంటూ ఉంటాడు.

Updated Date - Feb 02 , 2024 | 12:55 PM