Share News

Nijam Gelavali: పార్వతీపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన నేడు..

ABN , Publish Date - Feb 27 , 2024 | 09:27 AM

పార్వతీపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.

Nijam Gelavali: పార్వతీపురం జిల్లాలో నారా భువనేశ్వరి  పర్యటన నేడు..

పార్వతీపురం జిల్లా: తెలుగుదేశం (TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈరోజు పార్వతీపురం జిల్లాలో పర్యటిస్తారు. బుధవారం పాడేరు జిల్లా, గురువారం అనకాపల్లి జిల్లాలో భువనేశ్వరి పర్యటిస్తారు.

కాగా నారా భువనేశ్వరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వెళతారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేస్తారు. రాత్రికి అరకులోయ చేరుకుని బస చేస్తారు. బుధవారం అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందించి రాత్రికి నర్సీపట్నం చేరుకుని బస చేస్తారు. ఈనెల 29వ తేదీన నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పర్యటించి రాత్రికి అనకాపల్లి చేరుకుంటారు. మార్చి ఒకటో తేదీన అనకాపల్లి, ఎలమంచిలి నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి సాయం అందజేస్తారు. అక్కడ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని విమానంలో చెన్నై వెళతారు.

Updated Date - Feb 27 , 2024 | 09:29 AM