Share News

Visakha: రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:54 AM

విశాఖ: రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రయాణికులతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. రూఢాప్‌పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించాడు.

Visakha: రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్

విశాఖ: రైల్వేస్టేషన్‌లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. ప్రయాణికులతో పాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. రూఢాప్‌పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు నరకయాతన పడ్డారు. ముందు విద్యుత్ సరఫరా నిలిపివేపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే నాలుగో నంబర్ ప్లాట్ ఫోరమ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుపైకి దూకాడు. వెంటనే పోలీసులు పరుగున వెళ్లి ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 12 , 2024 | 11:55 AM