Sharmila : హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:00 PM
రాబోయే ఎన్నికల్లో హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసంలో తమిళనాడు వీసీకే ( vuduthalai Chiruthaigal Kachi) పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ షర్మిలను కలిశారు. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
![Sharmila : హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర](https://media.andhrajyothy.com/media/2024/20240306/YS_Sharmila_3f91cae500.jpg)
హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్లోని లోటస్ పాండ్ నివాసంలో తమిళనాడు వీసీకే ( vuduthalai Chiruthaigal Kachi) పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ షర్మిలను కలిశారు. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఏపీలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు భేటీ అయ్యామని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించినట్లు తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల విషయంపై చర్చించినట్లు చెప్పారు. త్వరలో పొత్తుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని షర్మిలా తెలిపారు. హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ఎన్నికల సమయంలో సీఏఏను అమలు చేస్తామని అంటుందని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల అన్నారు. దేశ రక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమితో కలిసి పనిచేస్తున్నామని తిరుమావళవన్ తెలిపారు.