Share News

Andhra Pradesh: మళ్లీ ఉష్ణోగ్రతల పెరుగుదల

ABN , Publish Date - May 25 , 2024 | 04:52 AM

గతవారం ఉపరితల ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు తగ్గాయి.

Andhra Pradesh: మళ్లీ ఉష్ణోగ్రతల పెరుగుదల

అమరావతి, మే24 (ఆంధ్రజ్యోతి): గతవారం ఉపరితల ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు తగ్గాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడినా రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవడం లేదు. దీంతో రోహిణీ కార్తె ప్రభావం చూపి, రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రత 43డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న రెండు రోజులు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Updated Date - May 25 , 2024 | 05:20 AM