Share News

AP Assembly: స్పీకర్‌ చైర్ వద్ద బల్లలు చరుస్తూ టీడీపీ నిరసన.. టీ బ్రేక్

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:16 AM

Andhrapradesh: రెండో రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తేలిపే తీర్మానంపై ప్రసంగం మొదలైంది.

AP Assembly: స్పీకర్‌ చైర్ వద్ద బల్లలు చరుస్తూ టీడీపీ నిరసన.. టీ బ్రేక్

అమరావతి, ఫిబ్రవరి 6: రెండో రోజు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తేలిపే తీర్మానంపై ప్రసంగం మొదలైంది. వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు ప్రసంగిస్తున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టచ్ చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు స్పీకర్ చైర్ వద్ద బల్లలు చరిచి తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం, స్పీకర్ స్థానం వద్ద ఉండి మరి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీ బ్రేక్ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2024 | 10:16 AM