Share News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడి.. పోలీసుల అదుపులో వ్యక్తి

ABN , Publish Date - Apr 14 , 2024 | 06:35 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిన మరుసటి రోజే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అలాంటి దాడే జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. గుంటూరు జిల్లాలోని తెనాలిలో వారాహి వాహనంలో యాత్ర కొనసాగిస్తుండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడి.. పోలీసుల అదుపులో వ్యక్తి

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) రాయితో దాడి జరిగిన మరుసటి రోజే జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) అలాంటి దాడే జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం హెలీకాప్టర్‌లో గుంటూరు జిల్లాలోని తెనాలి చేరుకున్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. పవన్ హెలీకాప్టర్ దిగాక హెలీప్యాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే.. అది ఆయనకు తగలకుండా కొంత దూరంలో పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జనసైనికులు నిందిత వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాగా రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఈ దాడి వెనుక గల కారణాలేంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 14 , 2024 | 07:03 PM