Share News

Crime News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:51 AM

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొరవారి సత్రం మండలం, కలగుంట వద్ద జాతీయ రహదారిపై బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది.

Crime News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొరవారి సత్రం మండలం, కలగుంట వద్ద జాతీయ రహదారిపై బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నాయుడుపేట నుంచి చెన్నై వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిలో మునిరాజా (24), రామ్‌కి (25), గౌతమ్ (23). సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 14 , 2024 | 11:51 AM