Share News

Nallapureddy: నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే నల్లపురెడ్డి అనుచరుల అరాచకాలు..

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:25 AM

నెల్లూరు జిల్లా: కొవ్వూరులో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు బరితెగించి అరాచకం సృష్టిస్తున్నారు. పోతిరెడ్డిపాళెంలో తిప్పను భారీ యంత్రాలతో తవ్వి రూ. కోట్లలో అక్రమ గ్రావెల్ అమ్మకాలు సాగిస్తున్నారు.

Nallapureddy: నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే నల్లపురెడ్డి అనుచరుల  అరాచకాలు..

నెల్లూరు జిల్లా: కొవ్వూరులో వైసీపీ నేతల (YCP Leaders) అరాచకాలు మితిమీరిపోయాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (MLA Nallapureddy Prasannakumar Reddy) ముఖ్య అనుచరులు బరితెగించి అరాచకం సృష్టిస్తున్నారు. పోతిరెడ్డిపాళెంలో తిప్పను భారీ యంత్రాలతో తవ్వి రూ. కోట్లలో అక్రమ గ్రావెల్ (Gravel) అమ్మకాలు సాగిస్తున్నారు. తిప్పను చదును చేసి రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారాలు మొదలుపెట్టారు. ఒక్కో ప్లాటుకు రూ. లక్షలు తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సర్పంచ్ నలుబోలు శ్రీవాణి, ఆమె భర్త సుబ్బారెడ్డి అరాచకం సాగిస్తుండడం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. తిప్పపై మూడు తరాలుగా 300 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇళ్లు ఖాళీ చేసి పోవాలంటూ గిరిజనులపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమను కాపాడాలంటూ గిరిజనలు బోరుమంటున్నా.. పట్టించుకునేవారులేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పత్తాలేరు.

Updated Date - Feb 25 , 2024 | 10:39 AM