Share News

Nara Lokesh: జగన్ ప్రచార పిచ్చి పిక్ స్థాయికి వెళ్లిందని.. చివరికి పాఠశాలలను కూడా వదల్లేదంటూ విమర్శలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:32 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రచార పిచ్చి పిక్ స్థాయికి వెళ్లిపోయిందని మండిపడ్డారు.

Nara Lokesh: జగన్ ప్రచార పిచ్చి పిక్ స్థాయికి వెళ్లిందని.. చివరికి పాఠశాలలను కూడా వదల్లేదంటూ విమర్శలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ప్రచార పిచ్చి పిక్ స్థాయికి వెళ్లిపోయిందని మండిపడ్డారు. చివరికి పాఠశాల విద్యార్థుల మరుగుదొడ్ల వద్ద "జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల" పేరిట ప్లెక్సీలను అంటించడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పాఠశాల్లో మరుగుదొడ్ల వద్ద జగన్ పోటోతో కూడిన ప్లెక్సీలను అంటించండంపై లోకేష్ ఎద్దేవా చేశారు.

ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా.. జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ ఆరాచక పాలనను తరిమికొట్టేందుకు 'రా.. కదలి రా' కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పుల్లారావు విమర్శించారు.

Updated Date - Jan 06 , 2024 | 05:09 PM