Share News

Nara Bhuvaneswari: టాప్‌లో ట్రెండ్ అవుతున్న నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:29 PM

నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్.. దేశవ్యాప్తంగా ఎక్స్‌ ఖాతాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన అన్నీ కుటుంబాలని నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు.

Nara Bhuvaneswari: టాప్‌లో ట్రెండ్ అవుతున్న నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి హ్యాష్ ట్యాగ్
Nara Bhuvaneshwari

అమరావతి, ఏప్రిల్13: నిజం గెలవాలి ఎన్డీఏ రావాలి (nijam gelvali nda ravali) హ్యాష్ ట్యాగ్.. దేశవ్యాప్తంగా ఎక్స్‌ ఖాతాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై చనిపోయిన అన్నీ కుటుంబాలని నిజం గెలవాలి (nijam gelvali) పేరుతో నారా భువనేశ్వరి (nara bhuvaneshwari) పరామర్శించారు.

RJD Manifesto: కేంద్రంలో అధికారం .. బిహార్‌కు ప్రత్యేక హోదా

ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.. పార్టీ అన్నీ విధాలుగా అండగా ఉంటుందని వారికి తన యాత్ర ద్వారా భువనమ్మ భరోసా కల్పించారు. ఏప్రిల్ 13వ తేదీతో.. అంటే ఈరోజుతో ఆ యాత్ర ముగిసింది. దీంతో ఎక్స్ వేదికగా భువనేశ్వరిని అభినందిస్తూ లక్షల సంఖ్యలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు (ap skill development case)లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu)ను జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 52 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. అయితే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపానికి గురై 203 మంది మరణించారు.

Elections 2024: సైకో ప్రభుత్వాన్ని తరిమితేనే రాష్ట్రానికి మంచి రోజులు.. బాలకృష్ణ

దీంతో ఆయా కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా ఇస్తానని నాడే నారా భువనేశ్వరి ప్రకటించారు. అన్నట్లుగానే నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరుతో యాత్ర చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే పార్టీ మీకు అన్ని విదాలుగా అండ దండ.. గా ఉంటుందని వారికి భువనమ్మ భరోసా ఇచ్చారు.

గతేడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమానికి నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. దాదాపు ఆరు నెలల పాటు ఈ యాత్ర సాగింది. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమంలో సాగింది.

ఏఫీ వార్తలు కోసం..

Updated Date - Apr 13 , 2024 | 07:37 PM