Share News

MP Gorantla Madhav: అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని సీఎంను కోరా.. జగన్‌తో భేటీ అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్

ABN , Publish Date - Jan 09 , 2024 | 06:47 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సమావేశమయ్యారు. సీఎంతో పలు అంశాలపై గోరంట్ల మాధవ్ చర్చించినట్లు తెలుస్తోంది.

MP Gorantla Madhav: అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని సీఎంను కోరా.. జగన్‌తో భేటీ అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్

అమరావతి, తాడేపల్లి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సమావేశమయ్యారు. సీఎంతో పలు అంశాలపై గోరంట్ల మాధవ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవలే హిందూపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జీ నుంచి గోరంట్లను సీఎం జగన్ తప్పించారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఏదో ఒక అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని సీఎంను కోరినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. సీటు విషయంలో సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

"హిందూపురం ఎంపీ సీటు ఇప్పటికే వేరొకరికి ప్రకటించారు. నేను ఇంకా మాట్లాడేందుకు ఏమీలేదు. సీఎంను ఎప్పుడు కలిసినా మాట్లాడేది ఏముంటుంది. నాకు ప్రత్యామ్నాయం ప్రాసెస్‌లో ఉంటుంది." అని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.

Updated Date - Jan 09 , 2024 | 07:06 PM