Share News

Andhra Pradesh : రేయ్‌.. నరుకుతాం కొడకల్లారా!

ABN , Publish Date - May 24 , 2024 | 03:58 AM

పోలింగ్‌ పూర్తయినా వైసీపీ వర్గీయుల అరాచకాలు మాత్రం తగ్గడంలేదు. అనంతపురం నగరంలో అధికార పార్టీ కార్యకర్త మల్లికార్జున రెడ్డి మద్యం సేవించి.. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ జనాన్ని బెంబేలెత్తించాడు. ‘జై జగన్‌.. జై వైఎస్సార్‌’ అంటూ గురువారం సాయంత్రం కారును వేగంగా.....

Andhra Pradesh : రేయ్‌.. నరుకుతాం కొడకల్లారా!

మద్యం మత్తులో వైసీపీ వర్గీయుల హల్‌చల్‌

అనంతలో ఏమాత్రం తగ్గని అధికారపార్టీ అరాచకాలు

అనంతపురం క్రైం/బెళుగుప్ప, మే 23: పోలింగ్‌ పూర్తయినా వైసీపీ వర్గీయుల అరాచకాలు మాత్రం తగ్గడంలేదు. అనంతపురం నగరంలో అధికార పార్టీ కార్యకర్త మల్లికార్జున రెడ్డి మద్యం సేవించి.. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ జనాన్ని బెంబేలెత్తించాడు. ‘జై జగన్‌.. జై వైఎస్సార్‌’ అంటూ గురువారం సాయంత్రం కారును వేగంగా నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడు. రూరల్‌ మండలం పిల్లిగుండ్ల కాలనీకి చెందిన మల్లికార్జునరెడ్డి, తన మిత్రులతో కలిసి ఇలా రచ్చ చేశాడు. ఈ క్రమంలో బైక్‌పై వెళుతున్న విష్ణు బిల్డర్స్‌ యజమాని తేజ బైక్‌ను ఢీ కొట్టినంత పనిచేశాడు. దీంతో తేజ కారును వెంబడించి.. డీఆర్‌డీఏ కార్యాలయం వద్ద అడ్డుకున్నాడు. కారు తాళాలు తీసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ‘రేయ్‌.. ఏమనుకున్నావ్‌.. నేను జగన్‌ మనిషిని.. నరుకుతాం లే.. కొడకల్లారా..’ అని బీరాలు పలికాడు. పోలీసులు రాగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించి పట్టుకుని టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గుండ్లపల్లి అధికారపార్టీకి చెందిన సర్పంచ్‌ పురుషోత్తం మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. అర్ధరాత్రి కారును గ్రామంలో తిప్పుతూ జనానికి నిద్రలేకుండా చేశాడు.

Updated Date - May 24 , 2024 | 03:58 AM