Share News

AP News: న్యూఇయర్ వేడుకల్లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:36 AM

Andhrapradesh: జిల్లాలోని డోన్ మండలం ఉంగరాణి గుండ్లలో న్యూ ఇయర్ వేడుకల్లో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. మద్యం మత్తులో 6 మందిపై ఓబులేసు, మధు గ్యాంగ్ దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఖాదర్, ప్రవీణ్, శివకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఖాదర్ మృతి చెందాడు.

AP News: న్యూఇయర్ వేడుకల్లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్.. వ్యక్తి మృతి

నంద్యాల: జిల్లాలోని డోన్ మండలం ఉంగరాణి గుండ్లలో న్యూ ఇయర్ వేడుకల్లో రౌడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. మద్యం మత్తులో 6 మందిపై ఓబులేసు, మధు గ్యాంగ్ దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఖాదర్, ప్రవీణ్, శివకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఖాదర్ మృతి చెందాడు. ఖాదర్ మృతి పట్ల బంధువులు ఆందోళనకు దిగారు.

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డోన్ రూరల్ ఎదుట జాతీయ రహదారిపై మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు అభ్యంతరం తెలపడంతో మృతుడి బంధువులు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతుడి బంధువుల ఆందోళనతో హైవేపై రెండు గంటలకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. డోన్ రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2024 | 11:36 AM