Share News

YCP: వైసీపీకి రాజీనామా చేసిన ‘కాపు’ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్!

ABN , Publish Date - Jan 12 , 2024 | 09:30 AM

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నేమకల్లు క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి.

YCP: వైసీపీకి రాజీనామా చేసిన ‘కాపు’ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్!

అనంతపురం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నేమకల్లు క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. నేమకల్లు క్వారీల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. జీఎస్టీ చెల్లించకుండా చేస్తున్న మైనింగ్‌ను నిలిపివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 09:30 AM