Share News

AP News: పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్ బట్టలూడదీసి తంతాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక

ABN , Publish Date - Apr 03 , 2024 | 08:19 PM

మంత్రి జోగి రమేష్ ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్ బట్టలూడదీసి తంతాం.. బుద్ధా వెంకన్న హెచ్చరిక

అమరావతి: మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ఓ జోకర్ అని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే బట్టలూడదీసి తంతామని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) హెచ్చరించారు. చంద్రబాబు ఇంటికి వెళ్తానని, ధర్నా చేస్తానని జోగి రమేష్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పెనమలూరులో వృద్ధురాలు ఘటనకు నిరసనగా చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేస్తానని మంత్రి జోగి రమేష్ అన్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద పెద్ద సంఖ్యలోమంగళగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న బుద్ధా వెంకన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు.


ఈ క్రమంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ..‘‘ జోగి రమేష్ ఓ జోకర్. పిచ్చి పిచ్చి వేషాలేస్తే జోగి రమేష్‌ను బట్టలూడదీసి తంతాం. చంద్రబాబు ఇంటికి వెళ్తాను. ధర్నా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు ఇల్లు దేవాలయం. దాడికి రావాలనే ఆలోచన వస్తేనే మేం ఊరుకోం. చంద్రబాబు ఇంటిపై గతంలో పోలీసుల అండతో దాడికి ప్రయత్నించి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ జోగి రమేష్ అలాంటి వేషాలేస్తే గుడ్డలూడదీసి నియోజకవర్గానికి పంపుతాం. జోగి రమేష్ గుర్తుంచుకో.. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. పెన్షన్లు ఆపిందే వైసీపీ. రెవెన్యూ అధికారులతో పెన్షన్ పంపిణీ చేయించొచ్చు కదా..? చంద్రబాబు ఇంటి వైపు చూస్తే జోగి రమేష్ కళ్లు పీకేస్తాం.’’ అని అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 08:28 PM