Share News

AP Election 2024: జగన్‌పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:41 PM

శనివారం కలకలం సృష్టించిన సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.

AP Election 2024: జగన్‌పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్

విజయవాడ: శనివారం కలకలం సృష్టించిన సీఎం జగన్‌పై రాయిదాడి ఘటనపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలంపల్లి శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా స్కూల్, టెంపుల్‌కు మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి ఈ దాడి జరిగినట్లు పోలీసుల నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఒక రాయితో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలంలో కొన్ని క్లూస్‌ను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.

Updated Date - Apr 14 , 2024 | 03:41 PM