CM Jagan: ఈనెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:18 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ఈనెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. 15న ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం తాడేపల్లికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...